కాంస్య పతకం గెలిచిన పి.వి సింధు
- August 01, 2021
టోక్యో: భారత స్టార్ షట్లర్ పి.వి సింధు టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్ మెడల్స్ అందుకున్న అథ్లెట్గా రికార్డులకెక్కింది.
నిన్నసెమీస్లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది.పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్వర్క్తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.
తాజా వార్తలు
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!







