స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం
- August 02, 2021
కువైట్: స్కూళ్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలు, సంసిద్ధతపై కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణకు ఉన్న సాధ్యసాధ్యాలు, అడ్డంకులపై చర్చించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తూనే స్కూళ్లను నిర్వహించే పక్కా ప్రణాళిక, అందుకు మద్దతుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆరా తీసింది. స్కూళ్లలో స్టెరిలైజేషన్ చేపట్టడం, విద్యార్ధులు భౌతిక దూరం పాటించటం, స్కూల్ సిబ్బంది అందరికి వ్యాక్సిన్ అందించటం వంటి చర్యలతో స్కూళ్లను ప్రారంభించటం, విద్యార్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం సాధ్యమేనా అని డిస్కస్ చేసింది. ఇదిలాఉంటే కువైట్ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్కూళ్ల ప్రారంభంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







