స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం
- August 02, 2021
కువైట్: స్కూళ్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలు, సంసిద్ధతపై కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణకు ఉన్న సాధ్యసాధ్యాలు, అడ్డంకులపై చర్చించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తూనే స్కూళ్లను నిర్వహించే పక్కా ప్రణాళిక, అందుకు మద్దతుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆరా తీసింది. స్కూళ్లలో స్టెరిలైజేషన్ చేపట్టడం, విద్యార్ధులు భౌతిక దూరం పాటించటం, స్కూల్ సిబ్బంది అందరికి వ్యాక్సిన్ అందించటం వంటి చర్యలతో స్కూళ్లను ప్రారంభించటం, విద్యార్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం సాధ్యమేనా అని డిస్కస్ చేసింది. ఇదిలాఉంటే కువైట్ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్కూళ్ల ప్రారంభంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి









