స్కూళ్ల ప్రారంభంపై కసరత్తు..ఇవాళ తుది నిర్ణయానికి అవకాశం
- August 02, 2021
కువైట్: స్కూళ్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలు, సంసిద్ధతపై కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణకు ఉన్న సాధ్యసాధ్యాలు, అడ్డంకులపై చర్చించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తూనే స్కూళ్లను నిర్వహించే పక్కా ప్రణాళిక, అందుకు మద్దతుగా అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆరా తీసింది. స్కూళ్లలో స్టెరిలైజేషన్ చేపట్టడం, విద్యార్ధులు భౌతిక దూరం పాటించటం, స్కూల్ సిబ్బంది అందరికి వ్యాక్సిన్ అందించటం వంటి చర్యలతో స్కూళ్లను ప్రారంభించటం, విద్యార్ధులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించటం సాధ్యమేనా అని డిస్కస్ చేసింది. ఇదిలాఉంటే కువైట్ మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్కూళ్ల ప్రారంభంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







