అల్ ఖోర్ నాసిరకం వంటకాలు..స్వాధీనం చేసుకున్న అధికారులు
- August 02, 2021
ఖతార్: అపరిశుభ్ర పరిసరాలు..నాసిరకం పదార్ధాలకు సిద్ధం చేస్తున్న వంటకాలను సీజ్ చేసినట్లు అల్ ఖోర్, అల్ తఖిరా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ప్రజలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని ఆరోపించింది. అల్ ఖోర్ ప్రాంతంలోని కార్మిక వసతి భవనాల్లో భవనాల్లో కొంత మంది ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య నియంత్రణ విభాగానికి సమాచారం అందింది అని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, హెల్త్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ కోసం ఘటనా స్థలానికి వెళ్లి నివాసం లోపల అపరిశుభ్రతతో తయారు చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీనిపై రిపోర్ట్ సిద్ధం చేసి, మానవ ఆహార చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!









