అల్ ఖోర్ నాసిరకం వంటకాలు..స్వాధీనం చేసుకున్న అధికారులు
- August 02, 2021
ఖతార్: అపరిశుభ్ర పరిసరాలు..నాసిరకం పదార్ధాలకు సిద్ధం చేస్తున్న వంటకాలను సీజ్ చేసినట్లు అల్ ఖోర్, అల్ తఖిరా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ప్రజలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని ఆరోపించింది. అల్ ఖోర్ ప్రాంతంలోని కార్మిక వసతి భవనాల్లో భవనాల్లో కొంత మంది ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య నియంత్రణ విభాగానికి సమాచారం అందింది అని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, హెల్త్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ కోసం ఘటనా స్థలానికి వెళ్లి నివాసం లోపల అపరిశుభ్రతతో తయారు చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీనిపై రిపోర్ట్ సిద్ధం చేసి, మానవ ఆహార చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







