అల్ ఖోర్ నాసిరకం వంటకాలు..స్వాధీనం చేసుకున్న అధికారులు
- August 02, 2021
ఖతార్: అపరిశుభ్ర పరిసరాలు..నాసిరకం పదార్ధాలకు సిద్ధం చేస్తున్న వంటకాలను సీజ్ చేసినట్లు అల్ ఖోర్, అల్ తఖిరా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ప్రజలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని ఆరోపించింది. అల్ ఖోర్ ప్రాంతంలోని కార్మిక వసతి భవనాల్లో భవనాల్లో కొంత మంది ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య నియంత్రణ విభాగానికి సమాచారం అందింది అని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, హెల్త్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ హౌసింగ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ కోసం ఘటనా స్థలానికి వెళ్లి నివాసం లోపల అపరిశుభ్రతతో తయారు చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీనిపై రిపోర్ట్ సిద్ధం చేసి, మానవ ఆహార చట్టం నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







