ఏపి కరోనా అప్డేట్
- August 02, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా..కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.ఏపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,641 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,546 మందికి పాజిటివ్గా తేలింది.మరో 15 మంది కరోనాతో మృతి చెందారు.ఇక, ఇదే సమయంలో 1,968 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 2,47,08,540కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,410 మంది ప్రాణాలు వదలగా.. 19,36,016 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







