ఏపి కరోనా అప్డేట్

- August 02, 2021 , by Maagulf
ఏపి కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా..కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.ఏపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం..రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,641 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 15 మంది కరోనాతో మృతి చెందారు.ఇక, ఇదే సమయంలో 1,968 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 2,47,08,540కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,70,008కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,410 మంది ప్రాణాలు వదలగా.. 19,36,016 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com