2.51 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- August 03, 2021
కువైట్: కువైట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 2.51 మిలియన్లకు చేరుకుందని ఆరోగ్య మంత్రి డాక్టర్ షేక్ బాసిల్ అల్-సబా తెలిపారు. ప్రతి వారం నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితులు స్థిరత్వ దశలో ఉన్నందున కోవిడ్ వ్యాప్తి, మరణాల రేటులో తగ్గుదల నమోదవుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 96 శాతంగా ఉందన్నారు. మంత్రి వెల్లడించిన వివరాలు, కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు మంత్రిమండలి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







