2.51 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- August 03, 2021
కువైట్: కువైట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 2.51 మిలియన్లకు చేరుకుందని ఆరోగ్య మంత్రి డాక్టర్ షేక్ బాసిల్ అల్-సబా తెలిపారు. ప్రతి వారం నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితులు స్థిరత్వ దశలో ఉన్నందున కోవిడ్ వ్యాప్తి, మరణాల రేటులో తగ్గుదల నమోదవుతున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 96 శాతంగా ఉందన్నారు. మంత్రి వెల్లడించిన వివరాలు, కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు మంత్రిమండలి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









