365 డేస్ సర్వీస్: దుబాయ్లోని భారత కాన్సులేట్ తొలి వార్షికోత్సవం
- August 03, 2021
దుబాయ్: ప్రవాసులకు అత్యావసర సేవలను మరింత చేరువ చేసేందుకు దుబాయ్లోని భారత కాన్సులేట్ గత ఏడాది ఆగస్టు 1న '365 డేస్ సర్వీస్' పేరిట కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఆగస్టు 1తో ఈ సేవలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఆదివారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తొలి వార్షికోత్సవం నిర్వహించింది.ఏడాది పొడువునా, వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటలు '365 డేస్ సర్వీస్' ద్వారా సేవలు అందించింది.వీకెండ్స్, సెలవు రోజుల్లో కూడా ఈ సర్వీస్ కొనసాగింది. 2020, ఆగస్టు 1న దుబాయ్కు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డా.అమన్ పూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దుబాయ్లోని భారత సమాజానికి 24/7 అత్యావసర సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ '365 డేస్ సర్వీస్'కు శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా వీకెండ్స్, హాలీడేస్లో కూడా ప్రవాసులకు ఎమర్జెన్సీ సర్వీసులు అందించడం జరిగిందని ఈ సందర్భంగా అమన్ పూరి అన్నారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో కాన్సులేట్ కార్యాలయాన్ని అత్యావసర సేవల కోసం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీసును ట్రావెల్ ధృవపత్రాల(పాస్పోర్టు,ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్, వీసాలు, ఇతర సేవలు) జారీ విషయంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం విస్తరించునున్నట్లు తెలిపారు.


తాజా వార్తలు
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్









