నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకుల్ని అనుమతిస్తే, విమానయాన సంస్థలకు జరీమానా
- August 03, 2021
కువైట్: నాన్ కువైటీ ప్రయాణీకుడ్ని నిబంధనలకు విరుద్ధంగా విమానంలోకి అనుమతిస్తే, ఆ విమానయాన సంస్థపై జరీమానాలు తప్పవని డిజిసిఎ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రయాణీకుడికి 500 దినార్ల చొప్పున జరీమానా వుంటుంది. ఉల్లంఘన మరోసారి జరిగితే జరీమానా రెండింతలవుతుంది. నిబంధనల ప్రకారం వలస ప్రయాణీకులు, తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. దానికి గ్రీన్ కలర్ స్టేటస్ లభించాల్సి వుంటుంది. కాగా, ఈ నిబంధన అమల్లోకి వచ్చాక చాలా తక్కువమంది ప్రయాణీకులు మాత్రమే నిబంధనలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. ఎక్కువమంది నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి ప్రయాణీకుడు 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తమ వెంట తెచ్చుకోవాలి.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









