నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకుల్ని అనుమతిస్తే, విమానయాన సంస్థలకు జరీమానా
- August 03, 2021
కువైట్: నాన్ కువైటీ ప్రయాణీకుడ్ని నిబంధనలకు విరుద్ధంగా విమానంలోకి అనుమతిస్తే, ఆ విమానయాన సంస్థపై జరీమానాలు తప్పవని డిజిసిఎ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రయాణీకుడికి 500 దినార్ల చొప్పున జరీమానా వుంటుంది. ఉల్లంఘన మరోసారి జరిగితే జరీమానా రెండింతలవుతుంది. నిబంధనల ప్రకారం వలస ప్రయాణీకులు, తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. దానికి గ్రీన్ కలర్ స్టేటస్ లభించాల్సి వుంటుంది. కాగా, ఈ నిబంధన అమల్లోకి వచ్చాక చాలా తక్కువమంది ప్రయాణీకులు మాత్రమే నిబంధనలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. ఎక్కువమంది నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి ప్రయాణీకుడు 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తమ వెంట తెచ్చుకోవాలి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







