నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకుల్ని అనుమతిస్తే, విమానయాన సంస్థలకు జరీమానా

- August 03, 2021 , by Maagulf
నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకుల్ని అనుమతిస్తే, విమానయాన సంస్థలకు జరీమానా

కువైట్: నాన్ కువైటీ ప్రయాణీకుడ్ని నిబంధనలకు విరుద్ధంగా విమానంలోకి అనుమతిస్తే, ఆ విమానయాన సంస్థపై జరీమానాలు తప్పవని డిజిసిఎ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో ప్రయాణీకుడికి 500 దినార్ల చొప్పున జరీమానా వుంటుంది. ఉల్లంఘన మరోసారి జరిగితే జరీమానా రెండింతలవుతుంది. నిబంధనల ప్రకారం వలస ప్రయాణీకులు, తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. దానికి గ్రీన్ కలర్ స్టేటస్ లభించాల్సి వుంటుంది. కాగా, ఈ నిబంధన అమల్లోకి వచ్చాక చాలా తక్కువమంది ప్రయాణీకులు మాత్రమే నిబంధనలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. ఎక్కువమంది నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి ప్రయాణీకుడు 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తమ వెంట తెచ్చుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com