ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే
- August 06, 2021
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాల అమలు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించారు.ఈ నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చించారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిన అంశంపై కేబినెట్లో చర్చించారు. 20 నిముషాల పాటు స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…
- 1.నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ ఖరారు
- 2.శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2)
- 3.ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2)
- 4.ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
- 5.ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
- 6.హైస్కూల్స్ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )
- 7.హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)
- 8.విద్యార్థులకు ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు
- 9.ఏ తరగతికి అయినా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది
- రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం
- నేతన్న నేస్తానికి 200 కోట్ల రూపాయలు కేటాయింపు
- ఆగస్టు 10న 3వ విడుత నేతన్న నేస్తం
- 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు ఈనెల 24న చెల్లింపులు
- ఈ నెల 14న విద్యాకానుక పంపిణీ
- అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు ఆమోదం
- రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారటీ ఏర్పాటు
- ఇకపై కాకినాడ డెవలప్మెంట్ అథారటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారటీ
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









