మరోసారి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి…
- August 08, 2021
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమించింది. ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు. రెండేళ్ల తరువాత వైవీ సుబ్బారెడ్డిని మారుస్తారనే ఊహాగానాలు వచ్చాయి.అయితే, వాటిక్ చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం మరోసారి వైవీని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అవకాశం ఇవ్వడం పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని, స్వామివారి కైంకర్యాలకు, ఛైర్మన్ పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా పరిపాలన సాగించామని, ఇకపై కూడా తిరుమల అభివృద్ధికి కృషిచేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను నియమించనున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









