భారతీయులు కువైట్ తిరిగొచ్చే విషయమై ఇబ్బందుల పరిష్కారం కోసం చర్చలు జరిపిన భారత రాయబారి
- August 10, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా, భారత రాయబారి సిబి జార్జికి ఘనంగా స్వాగతం పలికారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ రెహాబ్ అల్ వాతిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత్ - కువైట్ మధ్య వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి అందుతున్న పరస్పర సహకారంపై ఇరువర్గాలూ చర్చించడం జరిగింది. మెడికల్ స్టాఫ్ (భారతీయ డాక్టర్లు, నర్సులు టెక్నికల్ స్టాఫ్) నియామకాల గురించి చర్చించారు. కాగా, కరోనా పాండమిక్ నేపథ్యంలో భారతదేశం నుంచి రావాల్సినవారికి ఎదురవుతున్న ఇబ్బందులపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆయా ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రెధా చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









