భారతీయులు కువైట్ తిరిగొచ్చే విషయమై ఇబ్బందుల పరిష్కారం కోసం చర్చలు జరిపిన భారత రాయబారి

- August 10, 2021 , by Maagulf
భారతీయులు కువైట్ తిరిగొచ్చే విషయమై ఇబ్బందుల పరిష్కారం కోసం చర్చలు జరిపిన భారత రాయబారి

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా, భారత రాయబారి సిబి జార్జికి ఘనంగా స్వాగతం పలికారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ రెహాబ్ అల్ వాతిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భారత్ - కువైట్ మధ్య వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి అందుతున్న పరస్పర సహకారంపై ఇరువర్గాలూ చర్చించడం జరిగింది. మెడికల్ స్టాఫ్ (భారతీయ డాక్టర్లు, నర్సులు టెక్నికల్ స్టాఫ్) నియామకాల గురించి చర్చించారు. కాగా, కరోనా పాండమిక్ నేపథ్యంలో భారతదేశం నుంచి రావాల్సినవారికి ఎదురవుతున్న ఇబ్బందులపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆయా ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రెధా చెప్పారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com