ఆక్టోబర్ నుంచి డైరెక్ట్ క్లాసులు..విధివిధానాలు జారీ

- August 12, 2021 , by Maagulf
ఆక్టోబర్ నుంచి డైరెక్ట్ క్లాసులు..విధివిధానాలు జారీ

కువైట్: వచ్చే విద్యా సంవతసరం నుంచి డైరెక్ట్ క్లాసులు నిర్వహించాలని కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్ట్ క్లాసుల నిర్వహణపై విధివిధానాలను విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యర్ధులు క్లాసులకు ప్రత్యక్షంగా హజరు అవ్వాల్సి ఉంటుంది. అయితే..స్టూడెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించి..ఒక్కో గ్రూపుకు  అల్టర్నేట్ డేస్ లో క్లాసులు నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకోని ప్రతి విద్యార్ధికి, స్కూల్ స్టాఫ్ కు వారానికో సారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. పన్నెండేళ్లు..అంతుకుమించి వయసున్న విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు ఉదయం 7.30కు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఇంటర్మీడియెట్ లెవల్ స్టూడెంట్స్ కి ఉదయం 7.30 గంటలకు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నాం 2.05 గంటలకు ముగుస్తుంది. ప్రాక్టికల్స్, టెక్నికల్ సబ్జెక్టులను తర్వాతి సెమిస్టర్ కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com