ఆక్టోబర్ నుంచి డైరెక్ట్ క్లాసులు..విధివిధానాలు జారీ
- August 12, 2021
కువైట్: వచ్చే విద్యా సంవతసరం నుంచి డైరెక్ట్ క్లాసులు నిర్వహించాలని కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్ట్ క్లాసుల నిర్వహణపై విధివిధానాలను విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యర్ధులు క్లాసులకు ప్రత్యక్షంగా హజరు అవ్వాల్సి ఉంటుంది. అయితే..స్టూడెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించి..ఒక్కో గ్రూపుకు అల్టర్నేట్ డేస్ లో క్లాసులు నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకోని ప్రతి విద్యార్ధికి, స్కూల్ స్టాఫ్ కు వారానికో సారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. పన్నెండేళ్లు..అంతుకుమించి వయసున్న విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు ఉదయం 7.30కు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఇంటర్మీడియెట్ లెవల్ స్టూడెంట్స్ కి ఉదయం 7.30 గంటలకు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నాం 2.05 గంటలకు ముగుస్తుంది. ప్రాక్టికల్స్, టెక్నికల్ సబ్జెక్టులను తర్వాతి సెమిస్టర్ కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







