దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- August 12, 2021
దుబాయ్: భారత్కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. దీంతో రాత్రికి రాత్రే.. మిలియనీర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సాబు అలమిట్టత్ (57).. కొన్నేళ్లుగా దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో ట్రాఫిక్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ సిరీస్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు జాక్పాట్ తగిలింది. తాజాగా తీసిన డ్రాలో సాబు అలమిట్టత్.. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. ఈ తనకు డ్రాలో జాక్పాట్ తగిలిందని తెలిసి.. సాబు అలమిట్టత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను గెలుపొందిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!









