దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- August 12, 2021
దుబాయ్: భారత్కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. దీంతో రాత్రికి రాత్రే.. మిలియనీర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సాబు అలమిట్టత్ (57).. కొన్నేళ్లుగా దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో ట్రాఫిక్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ సిరీస్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు జాక్పాట్ తగిలింది. తాజాగా తీసిన డ్రాలో సాబు అలమిట్టత్.. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. ఈ తనకు డ్రాలో జాక్పాట్ తగిలిందని తెలిసి.. సాబు అలమిట్టత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను గెలుపొందిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







