కేరళను వణికిస్తున్న కరోనా వైరస్..!
- August 12, 2021
తిరువనంతపురం: కేరళను కరోనా వణికిస్తోంది. ఒకప్పుడు కరోనా వైరస్ను అణచివేసిన రాష్ట్రం.. ఇప్పుడు దాని ధాటికి విలవిలలాడుతోంది. వ్యాక్సిన్ వేసుకోని వారు, వ్యాక్సిన్ వేసుకున్న వారు అన్న తేడా ఏం చూపడం లేదు. రెండు డోసుల టీకా తీసుకున్నా సరే వైరస్ వదిలిపెట్టడం లేదు. తాజా లెక్కల ప్రకారం కేరళలో డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 40 వేల మందికి కరోనా వచ్చింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు లక్ష ఉంటే..ఒక్క కేరళలోనే 40వేల మంది ఉన్నారు. అంటే.. కేరళను కరోనా ఏ రేంజ్లో చుట్టుముట్టిందో అర్థం చేసుకోవచ్చు.
కేరళలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. రెండు డోసులు తీసుకున్న వారిని సైతం వైరస్ కుదిపేస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ 40వేల మంది కరోనా శాంపిళ్లను సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని భావిస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కేరళలో ఏ వేరియంట్ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటా కాదా అనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని కేంద్రం చెబుతోంది. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అక్కడి ఆరోగ్యశాఖ కూడా సమర్ధంగానే పనిచేస్తోంది. అయితే, ఈమధ్య కేరళలో సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలు బాగా జరిగాయి. పండగలు, జాతరలు జరగడంతో వైరస్ బాగా వ్యాపించిందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, రెండు డోసుల టీకా తీసుకున్న వారిని సైతం వైరస్ ఇలా అటాక్ చేయడం ఏంటన్నదే అంతుబట్టడం లేదు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







