దుబాయ్ లో "గల్ఫ్" పాట, టీజర్ ఆవిష్కరణ!
- March 13, 2016
గల్ఫ్ కు వలస వచ్చిన భారతీయుల విజయ గాధల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గల్ఫ్'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించడంతో పాటు 500 కేస్ స్టడీస్ తో యదార్ధ ఘటనల ఆధారంగా ఈ కధ తయారు చేసుకున్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల్లో ఒక పాటను, టీజర్ ను శనివారం దుబాయ్ లో ఆవిష్కరించారు. గల్ఫ్ వలసల మీద రూపొందిస్తున్న సినిమా కావడంతో దుబాయ్ లోని జజీరా ఎమిరేట్స్ పవర్ అనే ప్రముఖ కంపెనీ కి చెందిన సోనాపూర్ అనే లేబర్ క్యాంపు లో ఈ వేడుక నిర్వహించారు. జజీరా ఎమిరేట్స్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బాబు, బీటెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరాం, గల్ఫ్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్న అనురాధ, 'మాగల్ఫ్.కామ్' నిర్వాహకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమాలో కధానాయకుడు, నాయికలుగా కొత్తవారు నటిస్తుండగా ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, నాగినీడు, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు.
















తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







