బాధ్యతను మరువని స్టూడెంట్స్..వ్యాక్సిన్ ప్రోగ్రాంకు భారీ స్పందన
- August 15, 2021
సౌదీ: వ్యాక్సిన్ తీసుకోని బాధ్యతగా వ్యవహరించటంలో స్టూడెంట్స్ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.12-18 వయసు గ్రూపు బాల బాలికల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి
సంఖ్య 80 శాతానికి చేరింది.కేవలం పది రోజుల్లోనే 80 శాతం స్టూడెంట్స్ ఫస్ట్ డోస్ తీసుకోవటం విశేషం.సెకండ్ డోస్ తీసుకోవటంలోనూ విద్యార్ధులు తమ అవర్నేస్
చాటుకున్నారు.ఇప్పటికే కొద్ది మంది విద్యార్ధులు రెండో డోస్ స్లాట్ బుక్ చేసుకొని వ్యాక్సిన్ ఆవశ్యతను చాటిచెప్పారు.వ్యాక్సినేషన్ పై విద్యార్థుల అవగాహన స్థాయి గొప్పగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు,విద్యా సిబ్బంది & ఉద్యోగులలో అత్యధికులు కరోనావైరస్ కు వ్యతిరేకంగా టీకాలు వేయబడ్డారని మంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది.విశ్వవిద్యాలయాలలో వ్యాక్సిన్ పొందిన విద్యార్థులు 87.30 శాతం మంది ఉన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో విద్యా సిబ్బందితో పాటు ఇతర బోధనేతర సిబ్బంది 88.17 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







