కువైట్: ఇండియన్ అంబాసిడర్ కీలక ప్రకటన
- August 15, 2021
కువైట్: కువైట్ లోని ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్..భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక ప్రకటన చేశారు.కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడించారు.ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ..మొదటి విడతలో భాగంగా 65 కుటుంబాలను ఎంపిక చేసినట్టు చెప్పారు.కుటుంబానికి రూ.లక్ష పెద్ద మొత్తం కానప్పటికీ.. దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.120 KD కంటే తక్కవ వేతనం కలిగి ఉండి..కువైట్ లో కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలను టాస్క్ ఫోర్స్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







