కువైట్: ఇండియన్ అంబాసిడర్ కీలక ప్రకటన

- August 15, 2021 , by Maagulf
కువైట్: ఇండియన్ అంబాసిడర్ కీలక ప్రకటన

కువైట్: కువైట్ లోని ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్..భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక ప్రకటన చేశారు.కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడించారు.ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ..మొదటి విడతలో భాగంగా 65 కుటుంబాలను ఎంపిక చేసినట్టు చెప్పారు.కుటుంబానికి రూ.లక్ష పెద్ద మొత్తం కానప్పటికీ.. దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.120 KD కంటే తక్కవ వేతనం కలిగి ఉండి..కువైట్ లో కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలను టాస్క్ ఫోర్స్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com