ఎక్స్‌పో 20‌20 దుబాయ్: ఇండియానే అతి పెద్ద పార్టిసిపెంట్

- August 16, 2021 , by Maagulf
ఎక్స్‌పో 20‌20 దుబాయ్: ఇండియానే అతి పెద్ద పార్టిసిపెంట్

దుబాయ్:ఎక్స్‌పో 2020 దుబాయ్‌కి సంబంధించి భారతదేశం అతి పెద్ద పార్టిసిపెంట్ కానుందని యుఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ చెప్పారు.75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.యూఏఈలో చాలా మంది భారతీయులు తమ విజయ గాధలు చూసి ఆనందిస్తున్నారనీ, భారతదేశం అలాగే యూఏఈ మధ్య స్నేహ సంబంధాలు ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడుతున్నాయనీ అన్నారు.భారత కమ్యూనిటీ, ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో తమదైన ప్రత్యేక భూమిక పోషిస్తుందని అన్నారు.ఎక్స్‌పో సర్వీస్ స్టాఫ్, ఇండియా నుండి పెద్ద సంఖ్యలో యూఏఈకి రాబోతున్నారని,సెప్టెంబరు నుంచి యూఏఈ విజిట్ వీసాలను జారీ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నామనీ అన్నారు.ఆర్ధిక రంగం సహా అనేక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com