తాలిబన్ నేత కీలక ఆదేశాలు
- August 17, 2021
కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది.మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు.ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని,ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను కాపాడాలని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ కీలక నేత ముల్లా యాకూబ్ ఆదేశాలు జారీ చేశారు.తాలిబన్ కీలక నేత ఆదేశాలతో కాబూల్ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.ఈ ఉదయం నుంచి మెడికల్, కూరగాయల దుకాణాలు, బేకరీలు తిరిగి తెరుచుకున్నాయి.నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూకట్టారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







