తాలిబన్ ప్రతినిధులతో ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ
- August 18, 2021
దోహా: అఫ్గాన్ శాంతి, రాజకీయ సుస్థిరత కోసం ఖతార్ తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ ప్రతినిధి బృందంతో ఖతార్ ఉప ప్రధాని& విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ తానీ సమావేశమయ్యారు. అఫ్గానిస్తాన్ లో ప్రజల భద్రత, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. అఫ్గాన్ పౌరుల రక్షణ, జాతీయ సయోధ్యకు అవసరమైన తక్షణ చర్యలు ముమ్మరం చేయటం, అలాగే సమగ్ర రాజకీయ పరిష్కారం కోసం శాంతియుతంగా అధికార మార్పిడి కోసం జరగాల్సిన అవసరంపై చర్చించారు. అఫ్గాన్ ప్రజలు ఇన్నాళ్లుగా సాధించుకున్న అభివృద్ధి ఫలాలను అస్వాదించేలా, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రాముఖ్యతపై కూడా ఖతార్ మంత్రి తాలిబన్ ప్రతినిధులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







