అబుధాబి: పీసీఆర్ టెస్ట్ ఫీజులను సవరించిన ఆరోగ్యశాఖ
- August 18, 2021
అబుధాబి: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరిస్తూ అబుధాబి అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) ప్రకటన విడుదల చేసింది. సాధారణ పీసీఆర్ టెస్ట్ ఛార్జ్ ను AED 65గా ఫిక్స్ చేసింది. అయితే..అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే రిపోర్ట్ పొందే వారికి విడివిడిగా ధరలను నిర్ణయించింది. ఒకటి నుండి రెండు గంటలలోపు ఫలితాల కోసం AED 350 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు నుండి ఐదు గంటల్లో ఫలితాల పొందాలనుకంటే AED 250 గా పీసీఆర్ ధరలను ఫిక్స్ చేసింది. ఇక ఇంటి దగ్గరే పీసీఆర్ టెస్ట్ చేయించాలనుకుంటే హెల్త్ కేర్ సెంటర్లను సంప్రదించాలని..వారికి అదనపు రుసుము వర్తిస్తుందని పేర్కొంటూ డిఓహెచ్ వివరించింది. ఇదిలాఉంటే ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వారి సొంత ఖర్చుతోనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లక్షణాలు ఉంటే మాత్రం టెస్ట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







