తాలిబన్ ప్రతినిధులతో ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ

- August 18, 2021 , by Maagulf
తాలిబన్ ప్రతినిధులతో ఖతార్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ

దోహా: అఫ్గాన్ శాంతి, రాజకీయ సుస్థిరత కోసం ఖతార్ తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ ప్రతినిధి బృందంతో ఖతార్ ఉప ప్రధాని& విదేశాంగ మంత్రి  షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ తానీ సమావేశమయ్యారు. అఫ్గానిస్తాన్ లో ప్రజల భద్రత, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. అఫ్గాన్ పౌరుల రక్షణ, జాతీయ సయోధ్యకు అవసరమైన తక్షణ చర్యలు ముమ్మరం చేయటం, అలాగే సమగ్ర రాజకీయ పరిష్కారం కోసం శాంతియుతంగా అధికార మార్పిడి కోసం జరగాల్సిన అవసరంపై చర్చించారు. అఫ్గాన్ ప్రజలు ఇన్నాళ్లుగా సాధించుకున్న అభివృద్ధి ఫలాలను అస్వాదించేలా, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రాముఖ్యతపై కూడా ఖతార్ మంత్రి తాలిబన్ ప్రతినిధులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com