పరారీపై క్లారిటీ: అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు ఘనీ తొలి వీడియో మెసేజ్
- August 19, 2021
యూఏఈ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశం కాగానే దేశం విడిచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాను ఏ పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో రక్తపాతాన్ని నివారించటానికే తాను కాబూల్ విడిచిపెట్టానని ఆయన అన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని పారిపోయినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను డబ్బుతో పారిపోలేదని, తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకునే సమయంలో తాను అక్కడే ఉంటే పెద్ద ఎత్తున రక్తపాతాన్ని చూస్తూ ఉండేంవాడినని అన్నారు. ఆ దారుణాలను చూడకూడదనే దేశం విడిచి వచ్చానంటూ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ అధికారుల సలహా మేరకే కాబూల్ ను వదిలి వచ్చినట్లు తెలిపారు. తాలిబన్లు కాబూల్ ఆక్రమించుకుంటున్న సమయంలో హఠాత్తుగా దేశం విడిచి వెళ్లినందుకు ఘనీపై మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఘనీ తమని, దేశ ప్రజల్ని మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యూఏఈ నుంచి ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వివరణతో కూడిన వీడియో మెసేజ్ ను విడుదల చేశారు. ఘనీ యూఏఈలో ఉన్నారని బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత తాన మొదటి బహిరంగ వ్యాఖ్యలు ఇవే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







