జీతాల కోసం 300 మంది వ్యవసాయ కార్మికుల ఆందోళన
- August 19, 2021
కువైట్: చేసిన కష్టం వెట్టిచాకిరిగా మారుతోందని, జీతాలు కూడా ఇవ్వటం లేదంటూ దాదాపు 300 మంది వ్యవసాయ కార్మికులు ఆందోళన పాట పట్టారు. కువైట్లోని అబ్దాలీ ఫార్మ్ దగ్గర వీరంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది..హింసాత్మక ఘటనలకు ఆస్కారం ఇవకుండా ముందుజాగ్రత్తగా సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో వ్యవసాయ కార్మికులు తమ గోసను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..కనీస వసతులు కూడా లేవని, దుర్భర పరిస్థితుల్లో తాము బతుకీడుస్తున్నామని అక్కడి పరిస్థితులను వివరించారు. వ్యవసాయ కార్మికులు గోడు విన్న అంతర్గత మంత్రిత్వ శాక సిబ్బంది..కంపెనీ అధికారులతో మాట్లాడి బకాయి జీతాలు చెల్లించేలా ఒప్పించింది. జీతాలు చెల్లిస్తామంటూ కంపెనీ ప్రతినిధుల నుంచి హామీ రావటంతో వ్యవసాయ కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







