జీతాల కోసం 300 మంది వ్యవసాయ కార్మికుల ఆందోళన
- August 19, 2021
కువైట్: చేసిన కష్టం వెట్టిచాకిరిగా మారుతోందని, జీతాలు కూడా ఇవ్వటం లేదంటూ దాదాపు 300 మంది వ్యవసాయ కార్మికులు ఆందోళన పాట పట్టారు. కువైట్లోని అబ్దాలీ ఫార్మ్ దగ్గర వీరంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అంతర్గత మంత్రిత్వ శాఖ సిబ్బంది..హింసాత్మక ఘటనలకు ఆస్కారం ఇవకుండా ముందుజాగ్రత్తగా సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో వ్యవసాయ కార్మికులు తమ గోసను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..కనీస వసతులు కూడా లేవని, దుర్భర పరిస్థితుల్లో తాము బతుకీడుస్తున్నామని అక్కడి పరిస్థితులను వివరించారు. వ్యవసాయ కార్మికులు గోడు విన్న అంతర్గత మంత్రిత్వ శాక సిబ్బంది..కంపెనీ అధికారులతో మాట్లాడి బకాయి జీతాలు చెల్లించేలా ఒప్పించింది. జీతాలు చెల్లిస్తామంటూ కంపెనీ ప్రతినిధుల నుంచి హామీ రావటంతో వ్యవసాయ కార్మికులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







