గల్ఫ్ వాపసీలు 'స్వదేస్' పథకాన్ని ఉపయోగించుకోవాలి
- August 19, 2021హైదరాబాద్: వందే భారత్ మిషన్ కింద వాపస్ వచ్చిన భారతీయ పౌరుల కోసం ప్రభుత్వం 'స్వదేస్' (స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్ - ఉద్యోగ మద్దతుకోసం నైపుణ్య వంతులైన కార్మికుల సమాచార సేకరణ) ను భారత ప్రభుత్వం ప్రారంభించిందని, కోవిడ్ సంక్షోభంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులైన బాపురావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గల్ఫ్ కార్మికులకు సహాయపడుతున్నందుకు బిజెపి నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
విదేశాల నుండి వాపస్ వచ్చినవారు ఆన్లైన్ లో 'స్వదేస్' స్కిల్స్ కార్డ్ని పూరించాలి. ఇందులో వృత్తి, నైపుణ్యం, అనుభవం వివరాలను నమోదు చేయాలి. 'స్కిల్ కార్డ్' ద్వారా సేకరించిన సమాచారం స్కిల్ ఇండియా 'అసీం'(ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్) పోర్టల్తో అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సులభతరం చేయడానికి ఉపయోగించబడుతుందని ఈ సందర్బంగా నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.
'స్వదేస్' నైపుణ్య కార్డు కోసం గల్ఫ్ కార్మికుల పేర్లు నమోదు చేయడానికి త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 'గల్ఫ్ బంధు' పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక