భారత బ్లూ-కాలర్ కార్మికుల కోసం శిక్షణ నైపుణ్యాలు
- August 21, 2021
అజ్మన్: అజ్మన్ లో ఆగస్ట్ 20న ఇండియన్ అసోసియేషన్ అజ్మన్ అలాగే క్రోమ్వెల్ యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సహకారంతో భారత బ్లూ కాలర్ కార్మికులకు శిక్షణ, నైపుణ్యాలకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా శిక్షణ అందివ్వడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం. ఇండియన్ అసోసియేషన్ అజ్మన్ ప్రెసిడెంట్ అబ్దుల్లా సలెహ్, క్రోమ్ వెల్ యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మొహమ్మద్ షాఫిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈలోని భారతీయులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఇండియన్ ఎంబసీ పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోందని కాన్సుల్ జనరల్ పేర్కొన్నారు. జనవరి 2021 నుంచి చేపడుతున్న ఈ కార్యక్రమంలో 300 మంది వరకు భారత కార్మికులు లబ్ది పొందినట్లు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించనున్నట్లు అబ్దుల్ సలాహ్ పేర్కొన్నారు. 50 మంది భారత బ్లూ కాలర్ కార్మికులు తాజా సెషన్లో లబ్ది పొందారు.



తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







