అఫ్గన్ శరణార్ధులకు మద్దతుగా బహ్రెయిన్ ఎయిర్ బేస్ ఓపెన్
- August 22, 2021
బహ్రెయిన్: అఫ్గనిస్తాన్ తాలిబన్ చెరలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వేల సంఖ్యలో అఫ్గన్లు దేశం విడిచి పారిపోతున్నారు. తాలిబన్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఇతర దేశాలకు పయనం అవుతున్నారు. అయితే..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అఫ్గన్ శరణార్ధులకు బాసటగా నిలిచేందుకు ప్రయాణ నిబంధనలను సులభతరం చేసింది బహ్రెయిన్. అఫ్గన్ శరణార్ధులు ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలుగా తమ ఎయిర్ పోర్టులను వినియోగించుకోవచ్చని వెళ్లండించింది. అంటే..ముందుగా అఫ్గన్ నుంచి బహ్రెయిన్ చేరుకొని అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు అఫ్గన్ శరణార్ధులతో వచ్చే ఫ్లైట్స్ కి బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మానవతా దృక్ఫథంతో శరణార్ధులను ఆదుకోవటం తమ నైతిక బాధ్యత భావిస్తున్నామని, అఫ్గన్ శరణార్ధుల తరలింపు సులభతరం చేయటంలో తమ నిర్ణయం దోహదపడుతుందని బహ్రెయిన్ పేర్కొంది. శరణార్ధులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే ప్రపంచ దేశాలతో కలిసి పని చేయనున్నట్లు వివరించింది. ఆఫ్గనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, దేశీయ పరిస్థితులను స్థిరీకరించడం, ప్రస్తుత పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను కాపాడటంలో అన్ని పార్టీలు పాల్గొంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







