పని ప్రాంతాల్లో 100 శాతం సామర్థ్యం: సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి
- August 26, 2021
అబుధాబి: అబుధాబి పని ప్రాంతాల్లో 100 శాతం వర్క్ ఫోర్స్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది.అబుధాబి ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులు, అలాగే వెసులుబాట్లు పొందినవారు తమ గ్రీన్ స్టేటస్, అల్హోసన్ యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందని ఉద్యోగులు కోవిడ్ 19 పరీక్షను ప్రతి ఏడు రోజులకు ఓ సారి చేయించుకోవాలి.టెస్టింగ్ చేయించుకోనివారికి పని ప్రాంతాల్లోకి అనుమతి వుండదు. వారికి యాన్యువల్ లీవ్ నుంచి కోతతోపాటుగా, నెలవారీ వేతనం నుంచి కూడా కోతలుంటాయి.వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్ అలాగే వినియోగదారులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. వ్యాక్సినేషన్ పొందనివారు 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ చూపించాలి.చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు రిమోట్ వర్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.గ్రేడ్ 10 కంటే తక్కువ వయసున్నవారి తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









