పని ప్రాంతాల్లో 100 శాతం సామర్థ్యం: సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి
- August 26, 2021
అబుధాబి: అబుధాబి పని ప్రాంతాల్లో 100 శాతం వర్క్ ఫోర్స్ సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది.అబుధాబి ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందిన ఉద్యోగులు, అలాగే వెసులుబాట్లు పొందినవారు తమ గ్రీన్ స్టేటస్, అల్హోసన్ యాప్ ద్వారా చూపించాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందని ఉద్యోగులు కోవిడ్ 19 పరీక్షను ప్రతి ఏడు రోజులకు ఓ సారి చేయించుకోవాలి.టెస్టింగ్ చేయించుకోనివారికి పని ప్రాంతాల్లోకి అనుమతి వుండదు. వారికి యాన్యువల్ లీవ్ నుంచి కోతతోపాటుగా, నెలవారీ వేతనం నుంచి కూడా కోతలుంటాయి.వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్ అలాగే వినియోగదారులు గ్రీన్ స్టేటస్ చూపించాలి. వ్యాక్సినేషన్ పొందనివారు 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ చూపించాలి.చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు రిమోట్ వర్కింగ్ సౌకర్యం కల్పిస్తారు.గ్రేడ్ 10 కంటే తక్కువ వయసున్నవారి తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







