భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- August 27, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా టెర్రర్‌ కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో కొత్తగా 44,658 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,26,03,188 కి చేర‌గా ఇందులో 3,18,21,428 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,44,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లోక‌రోనాతో 496 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,36,861 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 79,48,439 మందికి వ్యాక్సిన్ లు  వేశారు. దీంతో భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 61,22,08,542 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com