ఢిల్లీ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా సోనూసూద్
- August 27, 2021
న్యూ ఢిల్లీ: లాక్డౌన్ సమయంలో చేసిన ఎంతో మందికి ఆపద్భాంధవుడిలా మారిన నటుడు సోనుసూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలోనే కాక ఇప్పటికీ కూడా తన సేవా కార్యక్రమాలను సోనూసూద్ కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇవ్వడం, అనారోగ్యం బారిన పడిన వారికి ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సోనూసూద్ సమావేశం కావడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై సోనూసూద్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా తాను ఎంపికైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం అయ్యారని కానీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో మంత్రి కేటీఆర్తోనూ సోనూసూద్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







