కరోనా బాధితులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలట: ICMR
- August 28, 2021
న్యూ ఢిల్లీ: కరోనా బాధితులు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలని.. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుంటే వచ్చే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తున్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఈ అధ్యయనంలో కోసం ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య చెన్నైలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్న హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల రక్త నమూనాలను సేకరించారు. వారిలో డోసు తీసుకున్న మొదటి రోజు, అలాగే డే 28, డే 56న SARS-CoV-2 నిర్దిష్ట యాంటీబాడీ ప్రతిస్పందనలను ఎలా ఉన్నాయని పరిశీలించారు. కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వైరస్ బాధితుల్లో.. అలాగే రెండు డోసులు తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలోని యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. అయితే ఇవి ప్రాధమిక ఫలితాలు మాత్రమేనని.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త లోకేష్ శర్మ వెల్లడించారు. ఒకవేళ ఇది గనక రుజువైతే రాబోయే కాలంలో కోవాగ్జిన్ టీకా సింగిల్ డోసు సిఫార్సు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







