అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగింపు
- August 29, 2021న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత్ ప్రభుత్వం.. సెకండ్ వేవ్ కేసులో ఇంకా అదుపులోకి రాకపోగా..కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగంచింది కేంద్రం.. అయితే, కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్లపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండగా..ఆ నిషేధం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చు నని తన సర్క్యులర్లో పేర్కొంది DGCA.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్