ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద 15 ఈవీ గ్రీన్ ఛార్జర్ల ఏర్పాటు

- August 29, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద 15 ఈవీ గ్రీన్ ఛార్జర్ల ఏర్పాటు

యూఏఈ: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (డిఇడబ్ల్యుఎ), 15 ఎలక్ట్రిక్ వెహికిల్ గ్రీన్ ఛార్జర్ స్టేషన్లను ఎక్స్‌పో 2020 దుబాయ్ పెవిలియన్ల (ఆపర్చ్యూనిటీ, సస్టెయినబులిటీ మరియు మొబిలిటీ) వద్ద ఏర్పాటు చేసింది. గ్రీన్ ఛార్జర్లు, ఎక్స్‌పోని సందర్శించేందుకు వచ్చే వాహన యజమానులకు ఉపయుక్తంగా వుంటాయి. 30 వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యం కల్పించేలా ఒక్కో పెవిలియన్ వద్ద ఏర్పాట్లు చేశారు. దుబాయ్ వ్యాప్తంగా 300 గ్రీన్ చార్జర్లను ఏర్పాటు చేసింది డిఇడబ్ల్యుఎ. 2021 డిసెంబర్ చివరి వరకు ఉచితంగానే ఛార్జింగ్ సౌకర్యం నాన్ కమర్షియల్ వాహనాలకు అందుబాటులో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com