అమెజాన్లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!
- August 29, 2021
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్వర్క్ అఫిర్మ్తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, అలాగే ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ లేనందున చాలా మంది క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అమెజాన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఫిర్మ్ చెబుతోంది. త్వరగానే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







