అమెజాన్లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!
- August 29, 2021
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్వర్క్ అఫిర్మ్తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, అలాగే ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ లేనందున చాలా మంది క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అమెజాన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఫిర్మ్ చెబుతోంది. త్వరగానే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









