అమెజాన్లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!
- August 29, 2021
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్వర్క్ అఫిర్మ్తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, అలాగే ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ లేనందున చాలా మంది క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అమెజాన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఫిర్మ్ చెబుతోంది. త్వరగానే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







