ఐసీయూలో 60కి తగ్గిన కోవిడ్ పేషెంట్ల సంఖ్య
- August 30, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ఐసీయూ) చికిత్స పొందుతున్న కోవిడ్ -19 పేషెంట్ల సంఖ్య 60కి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. గత మూడు రోజుల్లో సుల్తానేట్లో కొత్తగా 348 మంది కరోనా బారిన పడ్డారని, మరో 8 మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృతి చెందినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ COVID-19 కేసుల సంఖ్య 302,132 కి చేరుకుంది. మరణాల సంఖ్య 4057 కి పెరిగింది. ఇక కోవిడ్ నుంచి 493 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 291,532 కు చేరుకుంది. ఇదిలాఉంటే..గత 24 గంటల్లో 13 మంది కోవిడ్ తో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు 138 మంది ఉన్నారని, వీరిలో 60 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICU లు) చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







