ఐసీయూలో 60కి తగ్గిన కోవిడ్ పేషెంట్ల సంఖ్య
- August 30, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ఐసీయూ) చికిత్స పొందుతున్న కోవిడ్ -19 పేషెంట్ల సంఖ్య 60కి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది. గత మూడు రోజుల్లో సుల్తానేట్లో కొత్తగా 348 మంది కరోనా బారిన పడ్డారని, మరో 8 మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృతి చెందినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ COVID-19 కేసుల సంఖ్య 302,132 కి చేరుకుంది. మరణాల సంఖ్య 4057 కి పెరిగింది. ఇక కోవిడ్ నుంచి 493 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 291,532 కు చేరుకుంది. ఇదిలాఉంటే..గత 24 గంటల్లో 13 మంది కోవిడ్ తో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు 138 మంది ఉన్నారని, వీరిలో 60 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICU లు) చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









