స్కూళ్లలో మొబైల్ ఫోన్లకు షరతులతో కూడిన అనుమతి
- August 30, 2021
సౌదీ: ప్రత్యక్ష తరగుతల నిర్వహణకు అనుగుణంగా సౌదీ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరు తవక్కల్నా యాప్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ వివరాలను మొబైల్ యాప్ లో చెక్ చేయాల్సి ఉంటుంది కనుక ఫోన్లను తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్ధులకు, స్కూల్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే సేఫ్ వెదర్ లో తరగతుల నిర్వహణకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు..పాఠశాలల లోపల విద్యా ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయని విద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అల్-షెహ్రీ చెప్పారు. ఈ సూచనలకు అనుగుణంగా కమిటీలు ఖచ్చితంగా విద్యార్థుల ప్రవేశం, నిష్క్రమణ, అలాగే మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి నిబంధనలను రూపొందిస్తారని వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా









