స్కూళ్లలో మొబైల్ ఫోన్లకు షరతులతో కూడిన అనుమతి
- August 30, 2021
సౌదీ: ప్రత్యక్ష తరగుతల నిర్వహణకు అనుగుణంగా సౌదీ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరు తవక్కల్నా యాప్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ వివరాలను మొబైల్ యాప్ లో చెక్ చేయాల్సి ఉంటుంది కనుక ఫోన్లను తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్ధులకు, స్కూల్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే సేఫ్ వెదర్ లో తరగతుల నిర్వహణకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు..పాఠశాలల లోపల విద్యా ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయని విద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అల్-షెహ్రీ చెప్పారు. ఈ సూచనలకు అనుగుణంగా కమిటీలు ఖచ్చితంగా విద్యార్థుల ప్రవేశం, నిష్క్రమణ, అలాగే మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి నిబంధనలను రూపొందిస్తారని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









