స్కూళ్లలో మొబైల్ ఫోన్లకు షరతులతో కూడిన అనుమతి
- August 30, 2021
సౌదీ: ప్రత్యక్ష తరగుతల నిర్వహణకు అనుగుణంగా సౌదీ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతించింది. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరు తవక్కల్నా యాప్ ద్వారా వ్యాక్సిన్ వివరాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ వివరాలను మొబైల్ యాప్ లో చెక్ చేయాల్సి ఉంటుంది కనుక ఫోన్లను తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్ధులకు, స్కూల్ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే సేఫ్ వెదర్ లో తరగతుల నిర్వహణకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు..పాఠశాలల లోపల విద్యా ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిటీలు ఉన్నాయని విద్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అల్-షెహ్రీ చెప్పారు. ఈ సూచనలకు అనుగుణంగా కమిటీలు ఖచ్చితంగా విద్యార్థుల ప్రవేశం, నిష్క్రమణ, అలాగే మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి నిబంధనలను రూపొందిస్తారని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







