టాలీవుడ్ సినీతారలకు షాక్.. అప్రూవర్గా మారిన నిందితుడు
- September 01, 2021
టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు నిందితుడు కెల్విన్ లొంగిపోయాడు. ఎక్సైజ్ అధికారుల కేసు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు కెల్విన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఈడీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కెల్విన్ టాలీవుడ్ సినీతారల భాగోతం బయటపెట్టాడు. దీనికితోడు భారీ మొత్తంలో సినీతారల నుంచి కెల్విన్కు నగదు బదిలీ కావడంతో.. అతడి అకౌంట్ను ఫ్రీజ్ చేశారు అధికారులు. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సీని ప్రముఖులకు నోటీసులు పంపారు.
భారీ మొత్తంలో నగదు బదిలీ చేసిన సినీతారల బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు హాజరు అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ అధికారుల ముందు మంగళవారం హాజరవ్వగా.. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తాజాగా కెల్విన్ ఈడీ అధికారుల ముందు అప్రూవర్గా మారడంతో సదరు సినీ ప్రముఖులు ఇరకాటంలో పడ్డట్టు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా







