రిమోట్ విధానంలో ప్రయివేటు స్కూల్ టీచర్లకు అనుమతి
- September 01, 2021
రియాద్: దేశం వెలుపల ఉండిపోయిన టీచర్లు రిమోట్ పద్ధతిలో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తూ, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో సౌదీ అరేబియాకి రాలేకపోయిన మహిళా స్కూల్ టీచర్లకు, పురుష స్కూల్ టీచర్లకు మొదటి సెమిస్టర్ కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రయివేట్, అంతర్జాతీయ మరియు విదేశీ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. స్కూళ్లలో కొత్త విద్యాసంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ అవకాశం కల్పించింది. ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియా నుంచి చాలా మంది టీచర్లు సౌదీ అరేబియా తిరిగి రావల్సి ఉండగా, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాళ్లంతా తమ తమ దేశాల్లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









