ట్రావెల్ లా ఉల్లంఘనలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, SR100,000 ఫైన్
- September 02, 2021
సౌదీ: కింగ్డమ్ లోకి నకిలీ డాక్యుమెంట్లతో అక్రమంగా చొరబడే వారిపై సౌదీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష, జరిమానాలను దాదాపుగా రెట్టింపు చేస్తూ ట్రావెల్ లాలో సవరణలు చేసింది. చట్ట సవరణ ప్రకారం పాస్పోర్ట్లు/లైసేజ్-పాసర్ టిక్కెట్లను ఫోర్జరీ చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, SR 1,00,000 జరిమానా విధించనున్నారు. గతంలో మూడేళ్ల జైలు శిక్ష, SR50,000 జరిమానా ఉండేది. పాస్పోర్ట్లు/లైసేజ్-పాసర్ టిక్కెట్లలో అదనంగా సమాచారాన్ని జోడించడం, ఉన్న సమాచారాన్ని తొలగించడం, మార్చటం చేయటాన్ని ఫోర్జరీగా పరిగణిస్తారు. అలాగే ఉద్దేశపూర్వకంగా పాస్పోర్ట్లను నాశనం చేయడం లేదా డేటాను మార్చటం, వ్యక్తిగత ఫోటోలను మార్చడం వంటివి కూడా ట్రావెల్ లా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయి. అంతేకాదు..పాస్పోర్ట్/లైసేజ్-పాస్సర్ టిక్కెట్ని నిర్లక్ష్యంగా పోగొట్టుకోవటం, పాస్పోర్ట్లను చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, పాస్పోర్ట్ లేదా లైసెజ్-పాస్సర్ టిక్కెట్ విక్రయించటం కూడా ట్రావెల్ లా ఉల్లంఘనగా పరిగణిస్తారు. మూడవ పక్షానికి చెందిన పాస్పోర్ట్/లైసేజ్-పాసర్ టికెట్ని ఉపయోగించడానికి ప్రయత్నించే వారిపై, అలాగే సరైనా ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా నిర్దేశిత పోర్ట్ల ద్వారా కింగ్డమ్ కి వచ్చినా, వెళ్లే ప్రయత్నం చేసినా కూడా శిక్షార్హులు అవుతారు.
తాజా వార్తలు
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం









