టర్కీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం : 45 మంది ఉగ్రవాదులు హతo
- March 15, 2016
: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 11 టర్కీకి చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 45 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని టర్కీ సైనికాధికారులు చెప్పారు.పదకొండు ఎఫ్-16, ఎఫ్-4 జెట్ యుద్ధ విమానాలతో ఉత్తర ఇరాక్ సరిహద్దులోని కాందిల్ పర్వత ప్రాంతంలో ఉన్న కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) ఉగ్రవాద స్థావరాలపై మూకుమ్మడిగా దాడి చేశామని టర్కీ సైన్యం తెలిపింది. దీంతోపాటు రెండు భారీ ఆయుధాల నిల్వ స్థావరాలపై కూడా దాడి చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పలు బాంబులు, రెండు రాకెట్ లాంచింగ్ స్టేషన్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







