ఒమన్ కి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 బీమా తప్పనిసరి
- September 03, 2021ఒమన్: సుల్తానేట్ కి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కోవిడ్ 19 బీమా ఉండాలని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుల్తానేట్ కు విమాన సర్వీసులు నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రి ఖర్చులు కవర్ అయ్యేలా అంతర్జాతీయ బీమా ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యక్తిగత బీమా ఉన్నవారు, కంపెనీల నుంచి బీమా పొందిన వారు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణానికి ముందు తమ బీమా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే..ఒమనీ పౌరులకు బీమా నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అమలులోకి రావటంతో వివిధ దేశాల నుంచి సుల్తానేట్ కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..