ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ..
- September 03, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా పది అంశాలకు సంబంధించిన లేఖలను కేసీఆర్.. ప్రధానికి అందజేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్పై మోడీతో చర్చించారు.అలాగే ఐపీఎస్ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు సరిపడా ఐపీఎస్లను కేటాయించాలని సీఎం...మోడీని కోరారు.హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్పైనా విజ్ఞప్తి చేశారు.కొత్త జిల్లాలకు జవహర్ నవోదయా విద్యాలయాలను కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్కు ఐఐఐటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు అదనపు నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కేసీఆర్..మోడీని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









