వాట్సప్ సంస్థకు రూ.1,950 కోట్ల జరిమానా..!
- September 03, 2021
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక వాట్సప్కు....ఎదురుదెబ్బ తగిలింది.ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్... వాట్సప్ సంస్థకు వెయ్యి 950 కోట్ల జరిమానా విధించింది.2018లో యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నిబంధనలను వాట్సప్...ఉల్లంఘించినట్లు కమిషన్ నిర్ధరించింది.పర్సనల్ ఇష్యూలను..ఫేస్బుక్ అనుబంధ సంస్థలతో...వాట్సప్ పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.సిక్రెట్కు వాట్సప్ భంగం కలిగించిందని తేల్చింది. ఇందుకు పరిహారంగా వాట్సప్నకు...225 మిలియన్ యూరోల జరిమానా విధిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది.
పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ... యూరోపియన్ యూనియన్ 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్' పేరుతో మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. సోషల్ మీడియాలు వీటిని కంపల్సరీ...అనుసరించాలని స్పష్టం చేసింది కమిషన్. అయినా వాట్సప్ ఈ నిబంధనలకు తూట్లు పొడిచిందని పేర్కొంది.ఇది ఇలా ఉంటే....EU నిబంధనలకు అనుగుణంగా డేటా ప్రాసెసింగ్ విధానాలను మార్చుకోవాలని ఆ సంస్థకు మరోసారి సూచించింది. మరోవైపు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తమకు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాట్సప్ విభేదించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







