కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై ఇంకా స్పష్టత ఇవ్వని భారత్
- September 04, 2021
కువైట్ సిటీ: కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత రాకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇండియా నుంచి వారానికి 5528 సీట్లను కేటాయిస్తూ కువైట్ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రోజుల వారీగా సీట్ల కోటాపై విమాన సంస్థలకు లిస్ట్ కూడా విడుదల చేసింది. అయితే..భారత పౌర విమానయాన శాఖ మాత్రం కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్లు పున:ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ పునరుద్ధరణపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, బహుశా వచ్చే వారానికి అనుమతులు వస్తుండొచ్చని కువైట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..భారత్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా తమకు నిర్దేశించిన సీట్ల
మేరకు ఈ ఆదివారం నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీసులను నడపనున్నట్లు కువైట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తెలిపారు. ఇదిలాఉంటే..కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత నిర్ణయం ఆలస్యం అవుతుండటం..వన్ వే రిటర్న్ టిక్కెట్ల ఛార్జీల రేట్లు అమాంతంగా పెరిగిపోవటం ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









