కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై ఇంకా స్పష్టత ఇవ్వని భారత్
- September 04, 2021
కువైట్ సిటీ: కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత రాకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇండియా నుంచి వారానికి 5528 సీట్లను కేటాయిస్తూ కువైట్ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రోజుల వారీగా సీట్ల కోటాపై విమాన సంస్థలకు లిస్ట్ కూడా విడుదల చేసింది. అయితే..భారత పౌర విమానయాన శాఖ మాత్రం కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్లు పున:ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ పునరుద్ధరణపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, బహుశా వచ్చే వారానికి అనుమతులు వస్తుండొచ్చని కువైట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..భారత్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా తమకు నిర్దేశించిన సీట్ల
మేరకు ఈ ఆదివారం నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీసులను నడపనున్నట్లు కువైట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తెలిపారు. ఇదిలాఉంటే..కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత నిర్ణయం ఆలస్యం అవుతుండటం..వన్ వే రిటర్న్ టిక్కెట్ల ఛార్జీల రేట్లు అమాంతంగా పెరిగిపోవటం ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







