కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై ఇంకా స్పష్టత ఇవ్వని భారత్
- September 04, 2021
కువైట్ సిటీ: కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత రాకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇండియా నుంచి వారానికి 5528 సీట్లను కేటాయిస్తూ కువైట్ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రోజుల వారీగా సీట్ల కోటాపై విమాన సంస్థలకు లిస్ట్ కూడా విడుదల చేసింది. అయితే..భారత పౌర విమానయాన శాఖ మాత్రం కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్లు పున:ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ పునరుద్ధరణపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, బహుశా వచ్చే వారానికి అనుమతులు వస్తుండొచ్చని కువైట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..భారత్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా తమకు నిర్దేశించిన సీట్ల
మేరకు ఈ ఆదివారం నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీసులను నడపనున్నట్లు కువైట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తెలిపారు. ఇదిలాఉంటే..కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత నిర్ణయం ఆలస్యం అవుతుండటం..వన్ వే రిటర్న్ టిక్కెట్ల ఛార్జీల రేట్లు అమాంతంగా పెరిగిపోవటం ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







