48 గంటల్లో అఫ్గాన్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం..ఖతార్ ఆశాభావం
- September 04, 2021
దోహా: అఫ్గాన్ శరణార్ధులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని ఖతార్ వెల్లడించింది. మానవతా కోణంలో కాబూల్ ఎయిర్ పోర్టులో 24 గంటల నుంచి 48 గంటల్లోగా సేవలు ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్లు ఖతార్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా బలగాల చివరి విమానం టేకాఫ్ అయిన తర్వాత అఫ్గాన్ లోని కాబూల్ విమానాశ్రయం ఆంక్షల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయాన్ని మూసివేయడంతో విదేశీ విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. మానవతా సాయానికి ఇది గొడ్డలిపెట్టుగా మారింది. శరణార్ధులకు ప్రయాణానికి అడ్డుకట్టవేసేందుకు తాలిబన్లు అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక చర్య మనవతా సాయానికి సవాల్ గా మారింది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న శరణార్ధులకు అఫ్గాన్ దాటి వేళ్లే ఏకైక మార్గం కాబూల్ విమానాశ్రయమే. దీంతో విమానాశ్రయంలో సేవల పునరుద్ధరణపై అటు శరణార్ధులు, ఇటు విదేశీ పౌర విమానయాన సంస్థలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే..తాలిబన్లతో చర్చలు జరుపుతూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న ఖతార్...మరో 48 గంటల్లోనే ఈ ఆందోళనకు తెరపడొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకోసం తాము తాలిబన్లతో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. ఇదిలాఉంటే..అమెరికా భద్రతా బలగాలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత యూఏస్ సేనల నిష్క్రమించిన తర్వాత దోహా నుంచి తొలి గల్ఫ్ విమానం కాబూల్ లో ల్యాండ్ అయ్యింది. విమానాశ్రయానికి సంబంధించిన భద్రత, ఇతర సాంకేతిక అంశాలపై ఖతార్..అఫ్గాన్ కు సాయం చేయటంలో భాగంగా దోహా నుంచి తొలి ఫ్లైట్ కాబూల్ లో ల్యాండ్ అయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







