75 వేల యాంఫేటమిన్ పిల్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్
- September 06, 2021
సౌదీ: కింగ్డమ్ లోకి యాంఫేటమిన్ టాబ్లెట్లను అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నించిన ముఠాను సౌదీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 75,794 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నజీది మాట్లాడుతూ, క్రైమ్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఈ డ్రగ్స్ దొరికాయని తెలిపారు. రాజధాని రియాద్లో జకాత్, పన్ను, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు సిరియన్లు, ఒక ఈజిప్షియన్ ఉన్నారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మేజర్ అల్-నజిదీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో జ్యువెలరీ అసోసియేషన్ కీలక భేటీ
- తెలంగాణ లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..జాగ్రత్త!
- యూఏఈ, ఖతార్, కువైట్లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- యూఏఈలో ఇ-ఇన్వాయిసింగ్ సర్వీస్ ప్రొవైడర్ గడువు పొడిగింపు..!!
- IRGC-అనుబంధ నెట్వర్క్లో రద్దు చేసిన మండలి సభ్యులు..!!
- పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!
- 4వ జీసీసీ గేమ్స్.. 17 క్రీడాంశాల్లో 1,000 మందికి పైగా అథ్లెట్లు పోటీ..!!
- ధోఫార్లో స్ప్రింగ్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక చర్యలు..!!
- IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విజయవంతంగా తలసేమియా రన్









