యూఏఈ సందర్శించేందుకోసం అధికారిక ఆహ్వానాన్ని స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 07, 2021
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, యూఏఈ పర్యటించేందుకోసం అందిన ఆహ్వానాన్ని స్వాగతించారు. బహ్రెయిన్లో యూఏఈ రాయబారి షేక్ సుల్తాన్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, గుడైబియా ప్యాలెస్లో ప్రైమ్మినిస్టర్ మరియు క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి లేఖ అందింది క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫాకి. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ఇరు వర్గాలూ ఆకాంక్షించాయి. కాగా, ఈ సమావేశంలో ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









