ఎక్స్పో 2020: నేటి నుంచి మాక్ డ్రిల్ చేపట్టనున్న దుబాయ్ పోలీస్
- September 07, 2021
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఎక్స్పో 2020 పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నేటి నుంచి (సెప్టెంబర్ 7 మంగళవారం) ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 1 న ప్రారంభం కాబోతోంది. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్స్పో 2020 సన్నద్ధతకు సంబంధించి వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. 191 దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మరియు కమిటీ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ తహ్నౌమ్ మాట్లాడుతూ ఈ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగించి, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమంలో మెరుగైన సేవలు అందించనుంది దుబాయ్ పోలీస్.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









