ఎక్స్పో 2020: నేటి నుంచి మాక్ డ్రిల్ చేపట్టనున్న దుబాయ్ పోలీస్
- September 07, 2021
యూఏఈ: దుబాయ్ పోలీస్, ఎక్స్పో 2020 పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నేటి నుంచి (సెప్టెంబర్ 7 మంగళవారం) ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 1 న ప్రారంభం కాబోతోంది. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్స్పో 2020 సన్నద్ధతకు సంబంధించి వివరాలను నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. 191 దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మరియు కమిటీ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ తహ్నౌమ్ మాట్లాడుతూ ఈ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగించి, ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమంలో మెరుగైన సేవలు అందించనుంది దుబాయ్ పోలీస్.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







