సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం: మాదాపూర్ ఏసీపీ
- September 11, 2021
హైదరాబాద్: మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు తన స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సాయి తేజ్ బండి స్కిడ్ అయి కిందపడిపోయారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో లక్కీగా హెల్మెట్ పెట్టుకుని ఉన్నందున తలకు గాయాలు కాలేదని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు. రహదారిపై ఇసుక ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయిందని.. దాంతో తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కుడి కంటి పైభాగంలో, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. కాలర్ బోన్ విరిగింది.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరో 48 గంటలపాటు చికిత్స కొనసాగుతుందని ఈ మేరకు వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!







