రెండు వారాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోనున్న ఎయిర్పోర్టు
- September 11, 2021
కువైట్: కరోనా ఎమర్జెన్సీస్ - సుప్రీం కమిటీ, హెల్త్ అథారిటీస్తో కలిసి ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టు కార్యకలాపాల్ని పూర్తిస్థాయికి తీసుకు రావడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, రెండు వారాల్లోనే ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు వున్నాయని అథారిటీస్ అభిప్రాయపడుతున్నారు. కరోనా పాండమిక్ విషయమై స్థానిక అలాగే అంతర్జాతీయ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండడం వల్ల, తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటాయని అధారిటీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో రికవరీల పరంగా కువైట్ రెండో స్థానంలో వుంది.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







