రెండు వారాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోనున్న ఎయిర్పోర్టు
- September 11, 2021
కువైట్: కరోనా ఎమర్జెన్సీస్ - సుప్రీం కమిటీ, హెల్త్ అథారిటీస్తో కలిసి ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టు కార్యకలాపాల్ని పూర్తిస్థాయికి తీసుకు రావడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, రెండు వారాల్లోనే ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు వున్నాయని అథారిటీస్ అభిప్రాయపడుతున్నారు. కరోనా పాండమిక్ విషయమై స్థానిక అలాగే అంతర్జాతీయ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండడం వల్ల, తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటాయని అధారిటీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో రికవరీల పరంగా కువైట్ రెండో స్థానంలో వుంది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







