రెండు వారాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోనున్న ఎయిర్పోర్టు
- September 11, 2021కువైట్: కరోనా ఎమర్జెన్సీస్ - సుప్రీం కమిటీ, హెల్త్ అథారిటీస్తో కలిసి ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టు కార్యకలాపాల్ని పూర్తిస్థాయికి తీసుకు రావడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, రెండు వారాల్లోనే ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు వున్నాయని అథారిటీస్ అభిప్రాయపడుతున్నారు. కరోనా పాండమిక్ విషయమై స్థానిక అలాగే అంతర్జాతీయ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండడం వల్ల, తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటాయని అధారిటీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో రికవరీల పరంగా కువైట్ రెండో స్థానంలో వుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు