రెండు వారాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోనున్న ఎయిర్పోర్టు
- September 11, 2021కువైట్: కరోనా ఎమర్జెన్సీస్ - సుప్రీం కమిటీ, హెల్త్ అథారిటీస్తో కలిసి ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. ఎయిర్పోర్టు కార్యకలాపాల్ని పూర్తిస్థాయికి తీసుకు రావడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే, రెండు వారాల్లోనే ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు వున్నాయని అథారిటీస్ అభిప్రాయపడుతున్నారు. కరోనా పాండమిక్ విషయమై స్థానిక అలాగే అంతర్జాతీయ పరిస్థితుల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండడం వల్ల, తిరిగి సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకుంటాయని అధారిటీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో రికవరీల పరంగా కువైట్ రెండో స్థానంలో వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల